AP Government increase registration Charges: ఆంధ్ర ప్రదేశ్ లో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం అపుడే ప్రజల నడ్డి విరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హాయాములో వైసీపీ ప్రభుత్వం కరెంట్, నీటి సహా వివిధ ప్రభుత్వ ఛార్జీలను పెంచడం మూలానా.. బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వం. ఆ విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లింది. తాజాగా తాను అధికారంలోకి రాగానే మళ్లీ కూటమి ప్రభుత్వం ప్రజలను బాదడం మొదలు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Chandrababu Pawan Kalyan Met In Secretariat: మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం కావడం కీలకంగా మారింది. జనసేనలో భారీగా చేరికలు.. క్షేత్రస్థాయిలో బలపడుతుండడంతో పవన్ కల్యాణ్తో చంద్రబాబు భేటీ చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Vasamsetti Subhash Offers Pooja In Sampara Muktheshwara Temple: ఎన్నికల్లో గెలిచి మంత్రిగా గెలిచిన అనంతరం అంతా ఆనందంగా ఉండగా పరిస్థితులు సహకరించడం లేదు. సీఎం, స్పీకర్ నుండి క్లాస్ తీసుకోవడం.. రాజకీయంగా కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో ఆయన పూజలు చేసినట్లు తెలుస్తోంది.
Chandrababu Focused On Polavaram Project: ఆంధ్రప్రదేశ్కు వరంలాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Chandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా' పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.
Samantha ruth prabhu: సమంత రూత్ ప్రభు ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ చూసి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారంట. ఇటీవల సామ్.. కీర్తీ సురేష్ కు కూడా ప్రత్యేకంగా పెళ్లి నేపథ్యంలో విషెస్ చెప్పిన విషయం తెలిసిందే.
Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
Chandrababu First Reaction On One Nation One Election: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఎప్పుడు వచ్చినా ఏపీలో అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
YS Sharmila Demands To Chandrababu: చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాలనలో ఏమీ చేయకుండా విజన్ పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Record Level Liquor Sales In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే వైన్స్, బార్లకు బారులు తీరారు. ఫలితంగా మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలోనే భారీగా విక్రయాలు జరిగాయి. మందుబాబులకు మందు.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Slams On Chandrababu: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు చేసినంత బాదుడు దేశ చరిత్రలో ఎవరూ చేయలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.
Chandrababu Bought 5 Acre Land In Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించుకోనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఐదెకరాలు భూమి కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూమి ఎక్కడ.. ఎంత ధర తెలుసుకుందాం.
Chandrababu Plans To Again Old 13 Districts: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా వైఎస్ జగన్ 26 జిల్లాలుగా చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.
Chandrababu Naidu Review On One Family One Entrepreneur: పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. గృహిణులను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Orders To Usage Of Drone System: భద్రతా చర్యలు.. నేర నియంత్రణలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీస్ వ్యవస్థతోపాటు ప్రభుత్వ విభాగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా వాడాలని సూచించారు.
YS Sharmila Slams YS Jagan Sold AP Ports To Gautam Adani: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్ను ఆయన సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Pawan Kalyan Big Plan In Kakinada Port PDS Rice Smuggling: ఆంధ్రప్రదేశ్లో పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన హంగామాపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
AP Liquor shops Closed: ఆంధ్ర ప్రదేశ్ లో మందు బాబులకు బిగ్ షాక్ తగలనుంది. అవును ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రెండు రోజులు పాటు వైన్ షాపులు క్లో్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Govt Of AP Approves DPR Vijayawada Metro Rail: నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధికి కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ మెట్రో రైలుకు సంబంధించిన డీపీఆర్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
CM Chandrababu Plans To Reorganization Sachivalaya System: గ్రామ వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు సీఎం సమీక్ష చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.