Outsourcing Employees Salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలో పనిచేసే దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఊహించని కానుక అందినట్లయింది.
Pawan Kalyan comments on YS Jagan: అన్యాయాన్ని అరికట్టడానికే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన ఆశయం ఓడిపోలేదు. ఉత్తరాంధ్ర నుండే తాను పోరాటం నేర్చుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో జనసేన జండా గాజువాకలో ఎగురుతుంది అని ధీమా వ్యక్తంచేశారు.
Pawan Kalyan Visits Rushikonda: సీఎం జగన్కు ఎన్ని ఇళ్లు కావాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ ఇల్లు నిర్మిస్తాడా అని ముఖ్యమంత్రి జగన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
Pawan Kalyan's Speech From His Varahi Yatra in Visakhapatnam: ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, " జగన్కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది " అని ఆవేదన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Vizag City: విశాఖపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Links Jagan With Telangana: ఏపీ సీఎం జగన్ పేరును తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టిన పవన్ కళ్యాణ్.. జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను నేరాలకు అడ్డాగా మార్చారు. 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోతే ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి వారు ఏమయ్యారో తెలసుకునేందుకు కనీసం ఓ సమీక్ష నిర్వహించింది లేదని పవన్ మండిపడ్డారు.
FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు.
Punganuru Violence Case: పలమనేరు డి.ఎస్పీ సుధాకర్ రెడ్డి ఇంచార్జ్, సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ సందర్భంగా సబ్ అడిషనల్ ఎస్పీ కే లక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రోడ్ షోను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను ప్రేరేపించాడని పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపాడని అన్నారు.
YS Avinash Reddy's pressmeet: పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Chandrababu Pulivendula Tour: రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు.
Volunteer Arrested in Forgery Case: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలనే దురుద్దేశంతో ఆయా పథకాలకు అవసరమైన ధృవపత్రాల స్థానంలో నకిలీ ధ్రవపత్రాలు తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ఉదంతం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.
Niti Aayog Team meets AP CM YS Jagan: నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధతో పాటు పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్లతో కూడిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు.
YSR Nethanna Nestam Scheme: నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడానికి అప్పటి చంద్రబాబు నాయుడి పరిపాలనే కారణం అని వైఎస్ జగన్ ఆరోపించారు. నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి.. చివరికి చేనేతలను మోసం చేశారు అని మండిపడ్డారు.
Pawan Kalyan About His Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. అందుకోసం జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీరు ప్రాసిక్యూషన్ చేస్తాననగానే తానేమీ భయపడనని.. తాను ప్రాసిక్యూషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
AP, Telangana Rains: మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరిలోకి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది అని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ముందస్తుగా వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
Jagan Anna Thodu Scheme Money: జగనన్న తోడు పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 549.70 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,87,492 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు కింద రూ. 2,955.79 కోట్లు అందించినట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది.
Second Pension In One Family: ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు కింద ఒకరికే పెన్షన్ అందుతోంది. త్వరలో కుటుంబంలో రెండో వ్యక్తికి పెన్షన్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాలంటీర్లతో సర్వే నిర్వహిస్తున్నారు.
AP Govt: టమాటా ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న రాష్ట్రప్రజలకు భారీ ఊరట కల్పించింది ఏపీ ప్రభుత్వం. రైతు బజార్లలో కిలో రూ.50కే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు రైతుబజార్ల వద్ద బారులు తీరుతున్నారు.
AP New DGP News: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్ రెడ్డి గత 16 నెలలుగా ఇన్ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది.
Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని అంబటి రాంబాబు తేల్చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.