AP CM YS Jagan ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ టెక్నికల్ (కమెర్షియల్) ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ ( APTCIA) ప్రతినిధులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రిని నేరుగా కలిసేందుకు వీలు లేకపోవడంతో కరోనా సంక్షోభంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల ( Financial crisis) గురించి లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
జేసీ దివాకర్ రెడ్డికి ( JC Diwakar Reddy ) షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇదివరకే ఏపీ రవాణా శాఖ అధికారులు జరిపిన దాడుల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసి ప్రభాకర్ రెడ్డిలకు ( JC Prabhakar Reddy ) చెందిన దివాకర్ ట్రావెల్స్ ( Diwakar Travels ) బస్సులలో అనుమతి లేకుండా నడుస్తూ పట్టుబడిన వాటిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వ్యవహరించిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) విషయంలో నిమ్మగడ్డ లాజిక్ మిస్ అయినట్టే కన్పిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ ( AP AG Subrahmanya Sriram ) స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రమాణ స్వీకారం చేసి రేపటితో ఏడాది పూర్తవుతోంది. 3 వేల 648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో అనుకున్న లక్ష్యాన్ని అఖండ మెజార్టీతో సాధించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించిన జననేతగా పేరు తెచ్చుకున్న జగన్ 2019 మే 31న రాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ( Nimmagadda Ramesh Kumar ) తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High court ) ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏపీ సర్కార్కి ఇదో పెద్ద దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) స్పందించారు.
ఏపీ హై కోర్టు ( AP High court ) రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ( AP SEC Nimmagadda Ramesh Kumar ) ఆ స్థానం నుంచి తొలగించడంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన్ని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి టికె రమామణి ( IAS Ramamani ) గురువారం కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతకు గురైన రమామణి.. గురువారం సర్వ జన ఆసుపత్రికి వచ్చారు. వైద్యం అందిస్తుండగా రమామణి మృతి చెందారు. కర్నూలు జిల్లా నంద్యాలలో రమామణి స్వస్థలం.
మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్ మీడియా ( Print media ), సోషల్ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా ఘనంగా జరపాలని.. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి మహానాడు వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు భావించారట. కానీ కొరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి పరిణామాల కారణంగా అది బాబుకు కుదిరేలా లేదు. అందుకే తెలుగు తమ్ముళ్లు చేసేదేమిలేక వర్చువల్ మహానాడు నిర్వహించాలని ఓ నిర్ణయానికొచ్చారు.
టీటీడీ ఆస్తుల వేలంపై ( TTD lands auction ) ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పలు ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ( AP govt ) సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు ( IAS officers transfers in AP ) వెలువడ్డాయి. వీరిలో కొంతమంది ఐఏఎస్లకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలకు తోడు అదనంగా ఇంకొన్ని కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఏపీ సర్కార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్ ( Coronavirus ) అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఏపీలో మద్యం ధరల పెంపుపై (Liquor price hike in AP) టీడీపీ చేస్తోన్న విమర్శలపై స్పందించే క్రమంలో పార్ధసారథి ( MLA Parthasarathy ) బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కరోనావైరస్ కర్నూలు జిల్లాను వణికిస్తోంది. అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా (COVID-19 cases in Kurnool dist) మరో వుహాన్ని తలపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు (COVID-19 tests) నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
కరోనావైరస్పై యావత్ దేశం కలిసి చేస్తోన్న యుద్ధంలో భాగంగా కరోనావైరస్ ప్రభావం తీవ్రత ఆధారంగా కేంద్రం మరోసారి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించింది. ఈ క్రమంలో ఏపీలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఐదు జిల్లాలను రెడ్ జోన్లుగా గుర్తించిన కేంద్రం.. మరో ఏడు జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. ఆయా జోన్స్ వివరాలిలా ఉన్నాయి.
తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రెడ్జోన్, కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్నవారిలో ఎవరికైనా శ్వాస అందక ఇబ్బుందులు పడినా, లేదా ఫ్లూ లాంటి కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే 104కు ఫోన్ చేయాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.