భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. సోమవారం రాత్రి దాదాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలతో కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరారు.
India vs South Africa: Team India's Lunch Menu Goes Viral : టీమిండియా రెండో రోజు లంచ్ సెషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్ట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆడడానికి ఎలాగో అవకాశం లేదు.. సరే.. తినడానికి మంచి మెనూ ఉంది..కానిద్దాం పదండి అన్నట్లుగా సోషల్ మీడియాలో టీమిండియాపై కొన్ని పోస్ట్స్ వైరల్ అయ్యాయి.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. పదేళ్ల టెస్ట్ కెరీర్లో కోహ్లీ ఓ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడన్నారు.
భారత క్రికెట్కు కొత్త పాత్రల్లో సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా వెటరన్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఓ కోరిక తీరకుండానే రిటైర్మెంట్ ఇచ్చినట్టు భజ్జీ భావోద్వేగం చెందారు.
తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఐదవ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. అజింక్య రహానే, హనుమ విహారిలలో ఒకరికే అవకాశం దక్కనుంది. ఈ అంశంపై టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై స్పందించాడు.
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. క్రికెట్లోని అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా హర్భజన్ రిటైర్మెంట్ ప్రకటించారు.
దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్టు సిరీస్ సాధించాలంటే ఇదే మంచి అవకాశమని భారత టెస్ట్ బ్యాటర్ చేటేశ్వర్ పుజారా అన్నాడు. భారత జట్టు ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన చేస్తుందని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి విదేశీ పిచ్లపై విజయాలు సాదించిందన్నాడు.
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సెటైర్లు వేశాడు. ఇటీవలి కాలంలో పాక్ టీ20ల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వరుస సిరీసులను గెలుచుకుంటుది.
సుదీర్ఘమైన ఫార్మాట్లో టీమిండియా వరుస విజయాల వెనుక టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరియు మాజీ ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉందని చెప్పాడు.
రవీంద్ర జడేజా బుధవారం తన ట్విటర్ ఖాతాలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను పోస్ట్ చేశాడు. 'లాంగ్ వే టూ గో (ఇంకా చాలా ఆడాల్సి ఉంది)' అని ఫొటోకు కాప్షన్ ఇచ్చాడు.
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ ఖండించడంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గంగూలీపై ఒకవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తూనే.. మరోవైపు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. అంతేకాదు టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు.
BCCI vs Virat Kohli: బీసీసీఐకు టీమ్ ఇండియా మేటి క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య దూరం పెరుగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటన గురించి..బీసీసీఐకు నేరుగా సమాధానమిచ్చాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డేలు ఆడడని వచ్చిన వార్తలను బీసీసీఐ అధికారి తోసిపుచ్చారు. కోహ్లీ వన్డే సిరీస్లో ఆడుతాడా? అని అడగ్గా.. 'తప్పకుండా.. కోహ్లీ వన్డే సిరీస్లో ఆడుతాడు' అని తెలిపారు.
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయని సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్లకు దూరం కానున్నట్లు మంగళవారం ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన రోహిత్ శర్మ వన్డే సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల వన్డే కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించి.. రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. దీంతో కెప్టెన్సీ మార్పు విషయంలో ఇద్దరి స్పందన ఏంటి అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ కెప్టెన్సీ గురించి రోహిత్ స్పందించాడు.
కెప్టెన్సీ తొలగింపు విరాట్ కోహ్లీపై ఎలాంటి ప్రభావం చూపదని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. రానున్న మ్యాచులలో కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.