Lok Sabha Elections Results 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు విడతల్లో ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశ వ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా అందురు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే ఈ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి బొటాబొటీ మెజారిటీతో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో పలువురు రికార్డు మెజారిటీతో గెలుపొందగా.. మరికొందరు మాత్రం అత్పల్ప మెజారిటీతో గట్టెక్కారు.
Chandrababu as Kingmaker: అటు లోక్సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఘన విజయంతో ఏపీలో అధికారంలో వచ్చిన కూటమిలో మంత్రి పదవులు ఎవరెవరికనే విషయంలో చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో కేంద్రంలో కీలక పదవులపై తెలుగుదేశం కన్నేసింది.
Narendra Modi Ready To Take New Delhi: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ దాటి సీట్లు రావడంతో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
Lok Sabhas Election Polls 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కింది. కానీ ఈ సారి ఎన్నికల్లో కొంత మంది ఎంపీ అభ్యర్ధులు మాత్రం మెజారిటీలో రికార్డు క్రియేట్ చేసారు.
Lok Sabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండి అలియన్స్ కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న వాయనాడ్ తో పాటు రాయబరేలి నుంచి ముందంజలో ఉంటే.. వారణాసిలో నరేంద్ర మోదీ వెనకంజలో ఉన్నారు.
Telangana Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని NDA తిరిగి అధికారంలోకి రాబోతుందనే విషయం సర్వేలు స్పష్టం చేశాయి. అటు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలోని ఓ పార్లమెంట్ సీటులో మాత్రం కనీసం డిపాజిట్ దక్కదని సర్వేలు చెబుతున్నాయి.
Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Loksabha elections 2024: మోదీ మేనియాను ఇండియా కూటమి ఏమాత్రం ఆపలేకపోయిందని తెలుస్తోంది. దేశంలో ఈరోజు సాయత్రం ఏడవ దశ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు సాయంత్రం 6.30 తర్వాత అనేక సర్వే సంస్థలు ఎగ్జీట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి.
7th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల భాగంలో చివరి విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా మిగిలిన 57 లోక్ సభ సీట్లకు నేటితో ఎలక్షన్ ప్రక్రియ ముగియనుంది. ఈ విడతలో ప్రధాన మంత్రి పోటీ చేస్తోన్న వారణాసి నియోజకవర్గం పై అందరి చూపు ఆ సీటుపైనే ఉంది.
7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7వ దశ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. రేపు దేశ వ్యాప్తంగా 7వ విడతలో 57 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో ఈ ఎన్నికల ప్రక్రియ మొగుస్తుంది. ఈ విడతలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రంలోని లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయంటే..
Narendra Modi 48 Hours Yoga: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. కన్యాకుమారిలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్లో 48 గంటల పాటు యోగా చేయనున్నారు. ఈ మేరకు అక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి.
7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను.. భారత ఎన్నికల కమిషన్ 7 విడతల్లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేటి సాయంత్రంతో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి స్థానంతో పాటు 57 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Narendra Modi Hotel Bill Stay In Mysuru Hotel: ఇతర ప్రాంత పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ బస చేసిన హోటల్ అద్దె విషయమై వివాదం సద్దుమణిగింది. హోటల్ అద్దె చెల్లించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇపుడు పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు.
EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్కు భారీ షాక్ తగిలింది. అతడి నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Narendra Modi Assets Here Affidavit Details: లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. వారణాసి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన ఆస్తులు రూ.3 కోట్లు ఉన్నాయి. గతం కంటే కొంత పెరగడం విశేషం.
Narendra Modi Filed Nomination From Varanasi: మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాలు హాజరవగా.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.