35 BRS Leaders To Join Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయా ? బీఆర్ఎస్ పార్టీ నుంచి పదుల సంఖ్యలో నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? మరీ ముఖ్యంగా ఒక్క కాంగ్రెస్ పార్టీలోకే 35 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.
Podu Bhoomulu Patta Distribution to Tribals by KCR: గిరిజనుల చిరకాల కోరిక నెరవేరనుంది. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానుంది.
Challa Dharma Reddy Dares Konda Murali And Konda Surekha: కొండా దంపతులు భాష మార్చుకోవాలి అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చల్ల ధర్మా రెడ్డి హెచ్చరించారు. మొగతనం ఉన్నదా లేదా అని కొండా మురళి దంపతులు సవాళ్లు విసురుతున్నారు.. మరి తమ మగతనం గురించి కొండా కుటుంబానికి ఎలా చెప్తారో వాళ్లే చెప్పాలి అంటూ చల్ల ధర్మా రెడ్డి ఎద్దేవా చేశారు.
Revanth Reddy Pressmeet: చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
Revanth Reddy Satires on Bellampalli MLA Durgam Chinnaiah: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గురించి ప్రస్తావించేందుకు తనకే సిగ్గనిపిస్తోంది " అని అన్నారు. " దుర్గం చిన్నయ్య గురించి మాట్లాడటానికి సిగ్గనిపిస్తోంటే.. మరి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి వాళ్ల నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏమనిపించడంలేదా ? " అని ప్రశ్నించారు.
Minister KTR Speech: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పురపాలనలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్తో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యక్రమాలకు ఇచ్చిన అనేక అవార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమన్నారు.
YS Sharmila strong counter to KCR and KTR: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమర వీరులు చేసిన త్యాగాన్ని కల్వకుంట్ల వారి కుటుంబం తమ భోగంగా మల్చుకుంది అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ కాదని.. అది బందిపోట్ల రాష్ట్ర సమితికి "దోపిడీ మిషన్ " అని ఎద్దేవా చేశారు.
Revanth Reddy About KCR and Dharani Portal Scam: ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదు అని చెబుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గల్ఫ్ దేశాల్లోలా కేటీఆర్ను రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
Telangana bjp chief bandi sanjay: తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెక్ బౌన్సర్ సీఎం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులు బతికే పరిస్థితి లేదని కేసిఆర్ పుణ్యమా అని రైతులు బ్యాంకులలో డిఫాల్టర్లుగా నమోదయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
BRS MLC Kalvakuntla Kavitha: “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
YS Sharmila Slams BJP, BRS: బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.
Telangana Formation Day : తెలంగాణలో కుటుంబ పాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దొరికి అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని, తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని నిలదీశారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నాడు.
Harish Rao : రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతు బంధు ఇస్తున్నామని తెలిపాడు. ఇప్పుడు రైతుల అదాయం పదింతలు పెరిగిందని అన్నాడు. రైతులు చనిపోతే భీమా సైతం ఇస్తుందని అన్నాడు.
Ex Minister Vivek : పార్టీ మారుతున్నట్టుగా వస్తోన్న రూమర్లను ఖండించాడు మాజీ ఎంపీ, బీజేపీ జాతియ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ నియంత పాలనను ముగింపు పలకడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం ఆగదని వివేక్ అన్నారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలంటూ నినదించారు. ఖమ్మం నిరుద్యోగ ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ చురకలు అంటించారు.
Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉదయం సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యరావ్ ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో భేటీ కానున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల మీద చర్చించనున్నారు.
Telangana : రాష్ట్ర ప్రగతి, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షను చేపట్టాడు.
Revanth Reddy : సీఎం కేసీఆర్ తన చర్మాన్ని వలిచి చెప్పులు కుట్టించినా కూడా పాలమూరు ప్రజల రుణాన్ని తీర్చుకోలేరని రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో అయితే ప్రజలు ఓడిస్తారని పాలమూరులో ఆదరించారని, అలాంటి వారిని కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారని తన పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Telangana 10 years Celebrations Events List Schedule: " తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల " నేపథ్యంలో జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆ ఉత్సవాల రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ఖరారు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.