KCR Govt : మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు జూ. పంచాయితీ కార్యదర్శులు విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. సమ్మె చేస్తున్న పంచాయితీ కార్యదర్శుల్ని చర్చలకు పిలిచేది లేదని ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేసింది.
Talasani Srinivas Yadav comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తానే పశ్చాత్తాపం వ్యక్తంచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు అని అన్నారు.
హన్మకొండ జిల్లా బీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కమలాపుర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మధ్య వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది.
Priyanka Gandhi : తెలంగాణ అమరవీరులు ఏ లక్ష్యంతో అయితే ఉద్యమం చేశారో.. ఆ లక్ష్యం నెరవేరడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్ నగర్లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది.
Muthireddy Yadagiri Reddy's Daughter Files Forgery Case: జనగాం: స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి భూకబ్జా కేసులో వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయనపై కేసు పెట్టింది ఎవరో కాదు.. స్వయంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డినే.
Priyanka Gandhi Speech: నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని .... పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు.
Minister Puvvada : మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతోన్నాయని, తనను గెలిపించాలని, తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. కేసీఆర్ వెంట ఉండి వేల కోట్లు సంపాదించిన పొంగులేటి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని అన్నాడు.
KTR satires on Priyanka Gandhi: అంతరించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ పై దింపుడు కళ్లెం ఆశతో ఉన్న ప్రియాంకా గాంధీ తన ఈ పొలిటికల్ టూర్ ను ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలన్నారు.
TSRTC Chairman Bajireddy Govardhan: ఇప్పటివరకు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మరి అదే రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో బండి సంజయ్ ప్రశ్నించాలని టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బండి సంజయ్కి తెలివితేటలు ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి అని బాజిరెడ్డి గోవర్థన్ డిమాండ్ చేశారు.
KCR : రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో రోజురోజుకూ పరిపాలన దిగజారిపోతోందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్నారు. చైతన్య వంతులున్న మహారాష్ట్రలో పరిస్థితులు బాగాలేదన్నారు. గుణాత్మకమైన అభివృద్దిని తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అని అన్నారు.
KCR's First Signatures in Telangana New Secretariat: హైదరాబాద్: కొత్తగా ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో విధులు చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు.
YS Sharmila : ఖమ్మం జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తారు. వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. దెబ్బ తిన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.