కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆస్తులు వేలానికి వచ్చేశాయి. 23 స్థిరాస్తులను వేలం వేసి విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం..TTD నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రక్రియను కూడా ప్రారంభించింది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.
గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ వద్ద నిర్వహించిన పరేడ్లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతమయ్యింది. తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి వంటి ప్రతీకలను చేర్చి, అద్భుతంగా రూపొందించిన శకటం ప్రతీ ఒక్కరిని ఆకర్షించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కుంటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు సోమవారం తిరుమల శ్రీ వారిని దర్శించుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి కేటీఆర్ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోకి వచ్చే ఆలయాలను, కట్టడాలను భారత పురాతత్వ శాఖ చేసుకొనే స్వాధీనం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.