KTR Speech In Nizamabad Meeting : ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్ క్లాస్ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Revanth Reddy About Gaddar: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలుపెట్టి గద్దర్.. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొనియాడారు.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలను స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల రేవంత్ రెడ్డితో భట్టి, ఉత్తమ్కు గ్యాప్ రాగా.. తాజాగా ముగ్గురిని కలిపి స్క్రీనింగ్ కమిటీలో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Srinivas Goud Fires On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఆర్టీఐను అడ్డంపెట్టుకుని బ్లాక్మెయిలింగ్కు పాల్పడి కోట్లు సంపాదించాడని అన్నారు. తన మీద బురద జల్లడానికి అన్ని పార్టీల్లోని కొందరు నేతలు ఒక్కటయ్యారని అన్నారు.
Ramreddy Damodar Reddy Party Changing News: సూర్యాపేట నుంచి తాను పోటీచేసే విషయంలో లోకల్ - నాన్ లోకల్ అని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అంటూ ఆ విషయాన్ని ప్రస్తావించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. 40 సంవత్సరాలుగా సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నాను అనే విషయాన్ని పార్టీ మిత్రులు గమనించాలి అని అన్నారు.
Revanth Reddy Visits Uppal and LB Nagar: ప్రగతి భవన్ చిల్లర రాజకీయాలకు వేదికగా మారిందంటూ ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. వరదలపై ముందస్తుగా సీఎం సమీక్షలు చేయలేదని.. మంత్రి కేటీఆర్కు ప్రజల ప్రాణాలపై శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy Letter to Minister KTR: హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికే సరిపోయిందంటూ ఫైర్ అయ్యారు. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయిందన్నారు.
బీజేపీ సీనియర్ నేత డీకే అరుణపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లాలో బానిసలుగా మార్చారని అన్నారు. పాలమూరులోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
Ponguleti Srinivas Reddy About Land Kabja Allegations: తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.
Revanth Reddy Letter To Telangana Farmers: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై రైతులకు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని.. ఇందుకు సబ్ స్టేషన్లలోని బుక్లే సాక్ష్యమని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడుతోందన్నారు.
Revanth Reddy On Harish Rao: మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ కూడా కాలేని ఆయనను వైఎస్ఆర్ అప్పట్లో మంత్రిని చేశారని అన్నారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీష్కు సిగ్గుండాలంటూ ఫైర్ అయ్యారు.
KTR Plans for Revanth Reddy: ఈ నెల 17వ తేదీ నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు.
Dasoju Sravan Kumar Got Threatening Calls: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోమంటూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. ఈ కాల్స్పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి.. శిక్షించాలని కోరారు.
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
KTR About Revanth Reddy's Comments on Electricity Supply For Farmers: కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రైతులను ఉద్దేశించి హెచ్చరించారు. మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అని వ్యాఖ్యానించడమంటే.. ముమ్మాటికీ అది సన్నకారు రైతులను, చిన్నకారు రైతులను అవమానించడమే అవుతుంది అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Revanth Reddy Counter to KTR: తెలంగాణలో రైతాంగానికి కేవలం 3 గంటల విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా జరుగుతున్న రాజకీయం తెలంగాణలో రాజకీయాన్ని ఎంత వేడెక్కించిందో తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ సర్కారుతో పాటు మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
Komatireddy Venkat Reddy On Revanth Reddy: ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తప్పేనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఫ్రీ కరెంట్ అంశం రేవంత్కు సంబంధించినది కాదని.. హైకమాండ్ చూసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్యను కాంగ్రెస్ తీరుస్తాందని హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.