Jagadish Reddy Gets EC Notice: మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
Boora Narsaiah Goud: 2014లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన విజయం సాధించిన బూర.. 2019లో మాత్రం వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే బూర భువనగిరి ఎంపీగా పోటి చేసినా.. ఆయన సొంతూరు మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో ఉంది.
Munugode Bypoll: బూర నర్సయ్య గౌడ్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ బీసీ నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.ఇప్పటికే తన అనుచరులతో బూర మంతనాలు సాగించారని అంటున్నారు. కొందరు బీసీ నేతలు బూరకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లారని కూడా తెలుస్తోంది.
Munugode Bypoll: రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సాగుతుండగానే.. అదే మండల జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. తన అనుచరులతో సమావేశమై అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.కర్నాటి బాటలోనే ఇటీవల బీజేపీలో చేరిన మరికొంత మంది నేతలు తిరిగి అధికార పార్టీలోకి వస్తారనే ప్రచారం సాగుతోంది
Munugode Bypoll :మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విజయదశమికి అటు ఇటుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నాయి.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి కొత్త సమస్యలు వస్తున్నాయి. బీసీ లీడర్లను మంత్రి జగదీశ్ రెడ్డి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మీయ సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్న మంత్రి.. స్థానికంగా పట్టు ఉన్న బీసీ లీడర్లను మాత్రం ఆహ్వానించడం లేదు.
Munugode Bypoll : తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఫలితం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కావడంతో ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. జగదీశ్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి.
Jagadish Reddy: జగదీశ్ రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి. గత ఎనిమిదేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారు. అయితే జగదీశ్ రెడ్డి ఆహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి ఝలక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంప్ కొట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరారు మునుగోడు నియోజకవర్గ సీనియర్ నాయకులు, చండూరు జడ్పిటిసి సభ్యులు కర్నాటి వెంకటేశం. అతనితో పాటు గట్టుప్పల్ ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్, ఉడుతలపల్లి ఉప సర్పంచ్ గంట తులసయ్య బీజేపీలో చేరారు
Munugode Bypoll: మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడుకు సంబంధించి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి ఝలక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంప్ కొట్టారు.
Munugode Bypoll: కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్. టీఆర్ఎస్ ఆవిర్బావం నుంచి కేసీఆర్ వెంట నడిచి అంతా తానై వ్యవహరించింది హరీష్ రావు. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత టాప్ లీడర్లు వీరిద్దరే
Munugode Bypoll: మునుగోడులో మనదే విజయం.. ప్రస్తుతానికి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు 41 శాతం ఓటింగ్ ఉంది.. బీజేపీ అడ్రస్ గల్లంతే.. రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా పంపిస్తా.. ఇది పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.
Minister Jagadish Reddy slams BJP Govt over disturbances in Telangana. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
Minister Jagadish Reddy says Amit Shah without answering KCR's questions in Munugodu. కేసీఆర్ ప్రశ్నలకు జవాబియ్యకుండా షా పారిపోయారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Munugode ByPoll: మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజులుగా నియోజకవర్గంలోనే మకం వేసిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గత నాలుగు రోజుల్లో ఆరుగురు సర్పంచ్ లు, ఐదుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి ఎత్తులకు చెక్ పెట్టింది బీజేపీ. ఒకేసారి 10 మంది టీఆర్ఎస్ సర్పంచ్ లు కమలం గూటికి చేరారు. చండూరు మండలానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. గత వారం రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్న జగదీశ్ రెడ్డి.. సీనియర్ నేతలను పట్టించుకోకుండా ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారనే టాక్ గులాబీ కేడర్ నుంచి వస్తోంది.
Munugode Byelection:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది.గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్న పార్టీల నేతలు.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఉప ఎన్నికతో స్థానిక సంస్థల ప్రతినిధులకు పంట పండుతోందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.