Minampalli Hanmantha Rao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఆయన కొడుకు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నక్క ప్రభాకర్ కూడా వారితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Revanth Reddy Satires on KCR, KTR: విజయభేరీ సభ చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చలి జ్వరం వచ్చింది. ప్రగతి భవన్ ను ఖాలీ చేయాల్సి వస్తుందేమో అన్న భయం కేసీఆర్ లో మొదలయింది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Minister Harish Rao About Progress in Telangana Healh Department: 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే... ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకున్నామని.. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.. వైద్య సిబ్బంది సమిష్టి కృషివల్లే ఇది సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు.
నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం మహిళా బిల్లు ఆమోదించినందుకు.. నిజామాబాద్ నగర అభివృద్ధి కేటీఆర్ రూ.60 కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది క్యారక్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఈ నెల 27వ తేదీలోపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. తనకు మద్దతు ఇచ్చిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
5 New Bridges over Musi River and Esa River in Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కొత్తగా మరో ఐదు బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయి.
Koppula Harishwar Reddy Passes Away: బీఅర్ఎస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
Kishan Reddy Press Meet: రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగేలా వ్యవహరిస్తోందని.. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Harish Rao on Congress Guarantees: కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ కాంగ్రెస్ దయతో రాలేదని.. ప్రజలు పోరాడి గెలుచుకున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
CM KCR Speech from Kollapur: తెలంగాణ ఉద్యమంలో భాగంగా తాను పాలమూరుకి వచ్చినప్పుడు ఇక్కడి ప్రాంత వాసులతో మాట్లాడుతూ, రాష్ట్రం వస్తేనే మనల్ని పట్టి పీడిస్తున్న సకల దరిద్రలు విడిచిపెడతాయని అన్నానని.. మన రాష్ట్రం మనకు వస్తేనే మన హక్కులు, మన నీళ్లు మనకు దక్కుతాయని చెప్పానని గుర్తుచేసుకున్నారు.
ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత గురించి ఒక పుకారు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత పాలిటిక్స్ లోకి రానుంది అని.. అదెంత వరకు నిజమో తెలుసుకుందాం!
BRS MLC Kalvakuntla Kavitha: నిజామాబాద్ : అన్ని ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. లడ్డాఖ్కు వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ గౌతం ఆదానిని విమర్శించారని, మరి అదే విమర్శలను రాజస్థాన్లో చేయగలరా అని ప్రశ్నించారు.
Revanth Reddy Counter to KTR: అమరుల తల్లుల కడుపుకోత గుర్తించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సకుటుంబ సమేతంగా తెలంగాణకు వస్తుంటే.... రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగి కుట్రలు చేస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
31 పంపులను ఏర్పాటు చేయాల్సింది.. కేవలం ఒక్క పంపును ప్రారంభించి.. ప్రాజెక్ట్ పూర్తయిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Medical Colleges In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోందని.. ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
Minister Prashanth Reddy Comments on BJP and Congress: తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు.
Why KCR Is Contesting From Kamareddy: కామారెడ్డి నుండి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు.
YS Sharmila slams CM KCR: పనులు ఆగిపోయి పడావుపడ్డ ప్రాజెక్టును.. ఎన్నికల కోసం నామమాత్ర పనులు చేపట్టి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనేలా పాలమూరు, రంగారెడ్డి ప్రజలను భ్రమలకు గురయ్యేలా చేస్తున్నాడు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Double bed room flats: కేసీఆర్ పూర్వీకుల స్వస్థలం ఇక్కేడేనని.. అందుకే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓవైపు చెబుతుండగా.. మరోవైపు తాజాగా కురిసిన భారీ వర్షాలకు అదే నియోజకవర్గం పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వాన నాటికి మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకోవడం స్థానికంగా చర్చనియాంశమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.