How To Check Inter Results 2023: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షాల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఇంటర్ రిజల్ట్స్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్స్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి..? ఎలా చెక్ చేసుకోవాలి..? వివరాలు ఇలా..
JC Prabhakar Reddy : తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన దీక్ష కొనసాగుతోంది. మున్సిలప్ కార్యాలయంలోనే నిద్రపోయిన ఆయన కాలకృత్యాలు కూడా అక్కడే నిర్వహించారు. మున్సిపాలిటీ అక్రమాలను నిరసిస్తూ దీక్ష చేశారు.
YS Sunitha : వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కడప జిల్లా, ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం రేపుతోంది. వైఎస్ సునీతమ్మ టీడీపీలో చేరబోతోన్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. ఆమె రాజకీయ రంగం ప్రవేశం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
YS Sunitha Reddy Political Entry Posters: మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా..? ఆమె టీడీపీలో చేరనున్నారా..? ప్రస్తుతం కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
Nellore Mayor Potluri Sravanthi Issue: నెల్లూరు కౌన్సిల్ సమావేశంలో కొందరు కార్పొరేటర్లు తనపై దౌర్జన్యానికి యత్నించారని ఆరోపించారు మేయర్ పొట్లూరి స్రవంతి. తన చీర లాగేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TTD Alerts Devotees On Fake Website: నకిలీ వెబ్సైట్లతో తిరుమల శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా మరో నకిలీ వెబ్సైట్ను గుర్తించారు టీటీటీ ఐటీ అధికారులు. ఇలాంటి ఫేక్ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Times Now Servey : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన వైఎస్సార్ సీపీ ఓ గుడ్ న్యూస్ లభించింది. ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. లోక్ సభ స్థానాలన్నింటిని క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది.
Botsa Satyanarayana on DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఉద్యోగుల బదిలీ అంశం కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
Chandrababu Naidu : చంద్రబాబుకు ఎర్రగుండ పాలెంలో తిరిగే అర్హత లేదని ఏపీ మాత్రం ఆదిమూలపు సురేష్ అన్నారు. దళితులను అవహేళన చేసిన చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్ని రంగాల్లోనూ ఆయన దళితులకు అన్యాయం చేశారని అన్నారు.
Viveka Second Wife Statement: వివేకా హత్య కేసులో తొలిసారి ఆయన రెండో భార్య షేక్ షమీమ్ స్టేట్మెంట్ తెరపైకి వచ్చింది. 2010లోనే తనను వివేకా పెళ్లి చేసుకున్నారని ఆమె వెల్లడించారు. తమకు కొడుకు షేహన్ షా జన్మించాడని.. డీఎన్ఏ టెస్టుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు.
CM Jagan on DA Arrears: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు సీఎం జగన్. పెండింగ్ డీఏల విడుదలతోపాటు ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపారు. డీఏకు సంబంధించి ఈ నెలలోనే జీవో రానుండగా.. మేలో ఉద్యోగల బదిలీల ప్రక్రియ ప్రారంభంకానుంది.
Pollution Control : రోజురోజుకూ వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోతోన్నాయి. అదే స్థాయిలో కాలుష్యం కోరలు చాస్తోంది. వాటిని నియంత్రించేందుకు జేఎన్టీయూ ప్రొఫెసర్ శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్పెషల్గా యంత్రాన్ని సృష్టించారు.
Summer Temparature : ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతోన్నాయి. సూర్యుడు భగభగ మండిపోతోన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత ఉండబోతోందని తెలుస్తోంది.
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కాలి నొప్పితో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో జరిగిన పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా సీఎం కాలికి కట్టు కనిపించింది. ఈ నెల నాలుగో తేదీని వ్యాయామం చేస్తుండగా కాలు బెణికినట్టు తెలుస్తోంది.
CM Jagan : ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశాడు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతోన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలో బస చేయబోతోన్నట్టుగా తెలిపాడు.
Raghuveera Reddy On Political Re Entry: మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు చేయడం బాధ కలిగించిందని ఆయన అన్నారు.
YS Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తుది గడువు ముగుస్తుండటంతో.. సీబీఐ దూకుడు పెంచేసింది. ప్రధాన సాక్షి అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాలని సీబీఐ అడుగులు వేస్తోంది.
MP YS Avinash Reddy Bail Petition in TS High Court: వైఎస్ వివేకా కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి. సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కాసేపట్లు హైకోర్టు విచారించనుంది.
Neeraja Reddy Passed Away: కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోవడంతో పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.