షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ (Ministry of Shipping) పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్’గా మార్పు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
కోవిడ్-19 (Coronavirus) విషయంలో సకాలంలో చర్యలు తీసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించారని.. ఈ పని చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ (Telangana ) రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల ( heavy rains ) తో భాగ్యనగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) కి గురువారం లేఖ రాశారు.
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ (Time magazine) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో సహా ఐదుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ జాబితాలో షహీన్ బాగ్ ఉద్యమకారిణి 82 ఏళ్ల బామ్మ బిల్కిస్ బానో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనాసాగుతూనే ఉంది. నిత్యం 90వేలకు పైగా కరోనా కేసులు, 1100లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం కానున్నారు.
పార్లమెంటులో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ భాగస్వామ్య శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) రాజీనామా చేశారు. సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆమె గురువారం రాత్రి రాజీనామా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) జన్మదినం సెప్టెంబరు 17న జరగనుంది. ఈ ఏడాది ప్రధాని 70వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే.. మోదీ జన్మదినం ( Narendra Modi Birthday) సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతిష్టాత్మక రామ జన్మభూమి ఆలయంపై బ్రేకింగ్ న్యూస్ ఇది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్టు విశ్వసనీయం సమాచారం లభిస్తోంది.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం మే 30న ప్రస్తుతం NDA ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాలన పూర్తి కావడంతో.. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ముందున్న సవాళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
'కరోనా వైరస్' ఆర్థిక వ్యవస్థను కమ్మేస్తోంది. దేశవ్యాప్తంగా 54 రోజులపాటు విధించిన లాక్ డౌన్ 3.0 కొనసాగుతోంది. దీంతో పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ బంద్ అయ్యాయి.
ఊహించిందే జరిగింది. మరో 15 రోజులు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
'కరోనా వైరస్'పై భుజం భుజం కలిపి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు రెండో దఫా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. మూడు రోజుల క్రితం కేవలం 24 గంటల్లో దేశవ్యాప్తంగా వెయ్యి పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ .. పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు కారణమవుతోంది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న క్రమంలో భారత దేశం అన్ని దేశాలకు ఆశాజ్యోతిగా మారింది. ఎందుకంటే కరోనా వైరస్ పాజిటివ్ రోగుల చికిత్సలో భారత ఔషధం కీలక పాత్ర పోషిస్తోంది. అదే హైడ్రాక్సీక్లోరోక్విన్. దీన్ని ఎగుమతి చేయాలంటూ ప్రపంచంలోని దాదాపు 30 దేశాలు భారత దేశాన్ని కోరాయి.
'కరోనా వైరస్'తో పోరాడుతున్న అమెరికాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు భారత దేశానికి ధన్యవాదాలు.. అంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ట్వీట్ చేశారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ ఒక గొప్ప నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
కొద్ది రోజుల క్రితం భారత్ పై చిర్రుబుర్రులాడిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. అంతే కాదు థ్యాంక్యూ మోదీ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. పైగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ పెద్దన్నకు ఎందుకు కోపమొచ్చింది..?
'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ మద్దతు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.