Good newsకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... త్వరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. డియర్నెస్ అలవెన్స్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు పొందుతున్న 34 శాతంగా డీఏను మరో 4 శాతం పెంచాలని భావిస్తోంది. ఈ పెంపు జరిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 38 శాతం డీఏ పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా కేంద్రం సమాచారం ఇస్తోంది.
Undavilli Arun Kumar: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీని సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం అభ్యతరం వ్యక్తం చేశారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలకమైన భేటీ ఇవాళ జరగనుంది. కరోనా మహమ్మారి సంక్రమణ, పీఆర్సీ వివాదం ప్రధాన ఎజెండాలుగా కేబినెట్ భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీ తరువాత కేబినెట్ మార్పు కూడా ఉండవచ్చని సమాచారం.
Uttar Pradesh: వరకట్న వ్యవస్థని రూపుమాపేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. వివాహం సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వినిపించింది. డిఏ (dearness allowance) 4% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ దీపావళి పండగకు ముందే ప్రభుత్వాలు ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నాయి. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ ప్రకటనలు చేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.