Keerthy suresh: కీర్తిసురేష్ తన భర్తతొ కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, మహానటి ఇన్ స్టా పోస్ట్ లు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
గతేడాది వీరి పెళ్లి గొవాలో క్రిస్టియన్, హిందు సంప్రదాయం ప్రకారం జరిగింది. తన చిన్ననాటి ఫ్రెండ్ ను కీర్తి సురేస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. కీర్తి సురేష్ పెళ్లికాగానే బాబీజాన్ ప్రమోషన్ లలో పాల్గొన్నారు. ఆమె తన మంగళ సూత్రం వేసుకుని, మోడ్రన్ దుస్తుల్లో రచ్చ చేశారు. కీర్తిసురేష్ ఇటీవల సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు. పెళ్లైన కూడా తన భర్త ఆంటోనీ తట్టిల్ పైన తనదే డామినేషన్ అంటూ ఈ అమ్మడు ఇటీవల చెప్పుకొచ్చారు.
అయితే.. బేబీజాన్ కీర్తిసురేష్ కు మాత్రం అనుకున్నంత హిట్ ను తెచ్చిపెట్టలేకపోయింది. ఈ సినిమాతో మాత్రం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినట్లైంది. అయిన కీర్తిసురేష్ మాత్రం తగ్గెదెలా అన్న విధంగా ముందుకు వెళ్తుంది.
న్యూఇయర్ వేడుకలు, సంక్రాంతి వేడుకల ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ క్రమంలో కీర్తిసురేష్ తన భర్తపై తనదే డామినేషన్ అని.. అతనికి సిగ్గేక్కువ అని, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించడని కీర్తి సురేష్ చెప్పింది.
తన భర్తతో కూడా ఇటీవల చాలానే హనీమూన్ ట్రిప్ లు వేశారు. ప్రస్తుతం వీరిద్దరి రొమాంటిక్ పిక్స్ లను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్గా మారింది.
కీర్తిసురేష్ మాత్రం పెళ్లైన కూడా గ్లామర్ డోస్ ను ఏమాత్రం తగ్గించడం లేదని చెప్పుకొవచ్చు. ఇటీవల ఈ భామ.. మళయాళంలోని సినిమాకు ఓకే చెప్పారు. 2018 ఫేమ్ టోవినో థామస్తో ఈమె సినిమా చేయబోతున్నారు.
గతంలో రివాల్వర్ రీటాతో పాటు తమిళంలో కన్నివేడి సినిమాలు చేస్తుంది. అదేవిధంగా... తాజాగా టొవినోతో కొత్త ప్రాజెక్ట్కు కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం కీర్తిసురేష్ అక్క అనే సిరీస్ చేస్తున్నారు.