పుదీనా నీళ్లు తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా బీపీని ఈ నీళ్లు అదుపులో పెడుతుంది.
ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, ఒక లీటరు నీళ్లలో వేసి మరిగించాలి. 10 నిమిషాలు మరిగించిన తర్వాత, నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి.
పుదీనా నీళ్లు రక్త నాళాలను రిలాక్స్ చేసి, హైబీపీని తగ్గించడంలో సహాయపడతాయి.
దీనిలో ఉండే నేచురల్ ఎంజైమ్లు అజీర్ణ సమస్యలను తగ్గించి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచుతాయి.
పుదీనా నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే శరీరానికి తగినంత హైడ్రేషన్ అందుతుంది.
పుదీనా నీటిని క్రమం తప్పకుండా తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.