ఎన్ని మందులు వాడినా దగ్గు, జలుబు తగ్గట్లేదు? ఇది ఒక గ్లాసు తాగితే చాలు!

Dharmaraju Dhurishetty
Feb 22,2025
';

తరచుగా చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి.

';

శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని.. ఈ దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు.

';

చాలామంది దగ్గు, జలుబుతో బాధపడేవారు ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా వాడడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ఈ దగ్గు, జలుబు సమస్యలకు సులభంగా ఇంట్లోనే ఆయుర్వేద పద్ధతిలో చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ రెమెడీ వినియోగిస్తే సమస్య పరార్..

';

ముఖ్యంగా వాముతో తయారుచేసిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల దగ్గుతో పాటు జలుబు సమస్య కూడా తొలగిపోతుందట.

';

అలాగే వాములో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

వాములో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తాయట. ఇవే కాకుండా బోలెడు లాభాలను చేకూర్చుతాయి.

';

అయితే ఈ వాము వాటర్ ను మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని తాగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

ఈ వాము వాటర్‌ను తయారు చేసుకోవడానికి ఒక రోజు ముందే ఒక చిన్న గాజు గ్లాసులో నీటిని నింపుకొని వామును వేసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఉదయాన్నే నానబెట్టుకున్న వామును ఒక బౌల్లో వేసుకొని తగినంత నీటిని పోసుకొని బాగా వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న నీటిని ఒక గాజు గ్లాసులోకి వడకట్టుకొని తగినంత తేనె వేసుకొని మీరు చేసుకోండి.

';

తేనె వేసుకొని మిక్స్ చేసుకున్న వాము వాటర్ ను ఖాళీ కడుపుతో రోజు ఉదయాన్నే తాగితే.. సులభంగా దగ్గు, జలుబు సమస్యలకు విముక్తి కలుగుతుంది.

';

VIEW ALL

Read Next Story