ఇడ్లీ, దోసెల్లోకి పల్లి చట్నీ కన్నా కూడా దొండకాయ చట్నీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
దొండకాయ – 250 గ్రాములు, ఎండు మిర్చి – 4, పచ్చి మిర్చి – 2, శెనగపప్పు – 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్, ఇంగువ – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత, పులుపు కోసం – చిన్న టమోటో లేదా చింతపండు, నూనె – 2 టేబుల్ స్పూన్లు
దొండకాయలను చిన్న ముక్కలుగా తరిగి, నూనెలో వేయించాలి. మరోపక్క శెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, జీలకర్ర, ఇంగువ వేయించి పొడిచేయాలి. మిక్సీలో ఈ వేయించిన మిశ్రమాన్ని, దొండకాయ ముక్కలను వేసి గ్రైండ్ చేయాలి. రుచికి తగినంత ఉప్పు, పులుపు కలిపి మళ్లీ గ్రైండ్ చేసి
వెన్న లేదా నెయ్యి కలిపి ఇడ్లీతో తింటే అదిరిపోతుంది. దోశతో కలిపి మరింత రుచిగా అనుభవించొచ్చు. అన్నం, పెరుగుతో తింటే కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది.
శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు అందుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో సహాయపడుతుంది.